బోయకొండ గంగమ్మ హుడీ ఆదాయం కోటి ఇరవై ఐదులక్షలు..
అన్నమయ్య జిల్లా, పుంగనూరు
చౌడేపల్లి : మండలం లోని దిగువపల్లి గ్రామములో వెలసిన
ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూపాయలు 1,25,45,420.00, బంగారు 950 గ్రాములు, వెండి 100 గ్రాములు, ఫారెన్ కరెన్సీ యూరో పది ఒక నోటు, యూరో ఐదు ఒక నోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒకదినార్ ఒక నోటు, థాయిలాండ్ ఇరవై ఒకనోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ట్రినిడా అండ్ టబాగో ఇరవై డాలర్లు ఒక నోటు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ట్రినిడా అండ్ టబాగో ఒక డాలర్ ఒక నోటు, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179 లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూపాయలు 96,241.00 వచ్చినవి. సదరు లెక్కింపునకు దేవస్థాన ఉప కమీషనరు మరియు కార్యనిర్వాహణాధికారి ఏకాంబరం, అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి విశ్వనాధ్, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.