BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:04 PM
109 వీక్షణలు

అత్యాచార ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదు చేసిన మహిళకు చిన్నమల్లయ్యతో ఐదేళ్ల పరిచయం ఉందని తెలిపారు. ఆమె పలు మార్లు డబ్బులు తీసుకున్నారని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. అలాగే చిన్నమల్లయ్య కుమారుడిపై కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ప్రభుత్వం తరఫున సహాయ పీపీ ప్రియాంక వాదనలు వినిపిస్తూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపిన అంశంపై విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నందున దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.