BREAKING
నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం పోలీస్ శాఖలో విషాదం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు.. ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! నేరాల నియంత్రణ భాగంలో సీసీటీవీ కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం పోలీస్ శాఖలో విషాదం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు.. ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..!
www.ntodaynews.com

అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:04 PM
22 వీక్షణలు

అత్యాచార ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదు చేసిన మహిళకు చిన్నమల్లయ్యతో ఐదేళ్ల పరిచయం ఉందని తెలిపారు. ఆమె పలు మార్లు డబ్బులు తీసుకున్నారని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. అలాగే చిన్నమల్లయ్య కుమారుడిపై కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ప్రభుత్వం తరఫున సహాయ పీపీ ప్రియాంక వాదనలు వినిపిస్తూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపిన అంశంపై విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నందున దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.