BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 04:04 PM
68 వీక్షణలు

అత్యాచార ఆరోపణలతో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేశారు.

పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదు చేసిన మహిళకు చిన్నమల్లయ్యతో ఐదేళ్ల పరిచయం ఉందని తెలిపారు. ఆమె పలు మార్లు డబ్బులు తీసుకున్నారని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. అలాగే చిన్నమల్లయ్య కుమారుడిపై కూడా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇక ప్రభుత్వం తరఫున సహాయ పీపీ ప్రియాంక వాదనలు వినిపిస్తూ, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపిన అంశంపై విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని చెప్పారు. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నందున దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు.