BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అవ్వల ఆశీర్వాదాలు... తాతల చిరునవ్వులు... దివ్యాంగుల ఆనందమే ఎన్టీఆర్ భరోసా విజయానికి నిదర్శనం..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:59 PM
77 వీక్షణలు

అవ్వల ఆశీర్వాదాలు... తాతల చిరునవ్వులు... దివ్యాంగుల ఆనందమే ఎన్టీఆర్ భరోసా విజయానికి నిదర్శనం..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం హృద్యంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ అందుకున్న తర్వాత వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, కళ్లలో మెరిసిన సంతోషం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తూ, పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. అధికారాన్ని ప్రజాసేవకు వినియోగిస్తూ సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

పెన్షన్ అందుకున్న పలువురు వృద్ధులు భావోద్వేగానికి లోనై, "ఇలాంటి ప్రభుత్వం మాకు నిజమైన భరోసా" అంటూ ఆనందం వ్యక్తం చేయడం తనను కదిలించిందన్నారు. కొందరు పెద్దలు కృతజ్ఞతతో కన్నీటి పర్యంతం కావడం ఈ పథకం ప్రజల జీవితాల్లో ఎంతటి మార్పు తీసుకువచ్చిందో తెలియజేస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే తమ రాజకీయాల పరమావధి అని మరోసారి స్పష్టం చేశారు.