www.ntodaynews.com
అయోధ్య నిరసనపై రాహుల్ గాంధీ సహా ముగ్గురిపై కేసు
జాతీయం
అయోధ్య నిరసనపై రాహుల్ గాంధీ సహా ముగ్గురిపై కేసు
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగిందంటూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి ఆలయ పూజారిగా నటిస్తూ విరాళాలు స్వీకరిస్తున్నట్లు ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ చర్య సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉందని ఆరోపించిన సాధు సమాజం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా రాహుల్ గాంధీ, పప్పు యాదవ్, అవధేశ్ ప్రసాద్లపై కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.