BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

అయ్యా చంద్రబాబు… నా ధాన్యం కొనుగోలు చేసి నా బిడ్డ పెళ్లి జరిపించండి!”

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 03:32 PM
28 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లాలో రైతుల ఆవేదన మళ్లీ రోడ్లెక్కింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తీవ్రంగా విమర్శించారు.

విస్సన్నపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో రైతులు తమ సమస్యలను వెల్లగక్కారు. చండ్రుపట్ల పెద్ద తండాకు చెందిన బాణావతు రాణి మాట్లాడుతూ, మూడు ఎకరాల్లో పండించిన 1126 నెంబర్ ధాన్యం సుమారు 280 బస్తాలు వచ్చాయని తెలిపింది. గత 18 రోజులుగా ధాన్యాన్ని ఎండబెట్టి రైతు భరోసా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా కొనుగోలు జరగలేదని వాపోయింది.

అకాల వర్షాల ముప్పు కారణంగా ధాన్యం తడిసిపోతుందనే భయం వెంటాడుతుందని, కనీసం గన్నీ సంచులు, టార్పాలిన్ పట్టాలు కూడా సరఫరా చేయలేదని ఆరోపించింది. మార్కెట్‌లో రూ.2,500 ఉండే టార్పాలిన్ పట్టాలను బ్లాక్ మార్కెట్‌లో రూ.4,500కు కొనాల్సి వచ్చిందని తెలిపింది. తన కుమార్తె పెళ్లి ఈ నెల 10న జరగాల్సి ఉందని, ధాన్యం అమ్మకంతో వచ్చే డబ్బుతో పెళ్లి జరిపించాలని భావిస్తున్నప్పటికీ, కొనుగోలు ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీళ్లు పెట్టుకుంది.

ఇక మిల్లర్లు సరైన సంచులు ఇవ్వకపోవడంతో పాటు, రవాణా ఖర్చులు, తరుగు పేరుతో ప్రతి సంచికి మూడు కిలోల వరకు రైతులపై అదనపు భారం మోపుతున్నారని రైతులు ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేదంటే రైతాంగం తరఫున భారీ నిరసనలు చేపడతామని హరినాథ్ హెచ్చరించారు.

ఈ ధర్నాలో పులగం వెంకటేశ్వర రెడ్డి, దుర్గం పుల్లారావు, వేముల బక్కయ్య, పరికళ కళావతి, మేకల కుమారి, చాట్ల బాబురావు, తేలేటి జమలయ్య, భూతం మారయ్య, భవాని, సీతామాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.