BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అయ్యర్లా జాతీయ మహాసభ విజయవంతం చేయండి!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:20 AM
151 వీక్షణలు

విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం

ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది.

సమావేశం ప్రారంభంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర నేత, అమరజీవి కామ్రేడ్ నందకిషోర్ ప్రసాద్ అకాల మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ మహాసభలు నవంబర్ 20, 21 తేదీలలో జార్ఖండ్‌లో జరుగనున్నాయని, వాటిని విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాధ్ పిలుపునిచ్చారు.

అదేవిధంగా అఖిలభారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు పంజాబ్‌లో జరుగనున్నాయని తెలిపారు.

జూలై 28న చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘పీపుల్స్ సిక్స్ డిమాండ్స్’ సాధన కోసం ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబూరావు, మేడూరి సర్వేసు, భవాని, కలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.