BREAKING
కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
www.ntodaynews.com

అయ్యర్లా జాతీయ మహాసభ విజయవంతం చేయండి!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:20 AM
16 వీక్షణలు

విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం

ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేటలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు అధ్యక్షతన జరిగింది.

సమావేశం ప్రారంభంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర నేత, అమరజీవి కామ్రేడ్ నందకిషోర్ ప్రసాద్ అకాల మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ మహాసభలు నవంబర్ 20, 21 తేదీలలో జార్ఖండ్‌లో జరుగనున్నాయని, వాటిని విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామ గ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాధ్ పిలుపునిచ్చారు.

అదేవిధంగా అఖిలభారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు పంజాబ్‌లో జరుగనున్నాయని తెలిపారు.

జూలై 28న చారుమజుందార్ వర్ధంతి సందర్భంగా గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘పీపుల్స్ సిక్స్ డిమాండ్స్’ సాధన కోసం ఉద్యమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధాతధంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబూరావు, మేడూరి సర్వేసు, భవాని, కలపాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.