బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ
బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ
మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం పరామర్శించారు. రెండవ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం ఇంటి వద్దే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. గౌస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, అధైర్యపడొద్దని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, 10వ వార్డుకు చెందిన గంధమల్ల శంకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను కూడా మాజీ ఎమ్మెల్యే పరామర్శించి, అందుతున్న వైద్య సహాయం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లూ ఎస్.కె. షబానా అజీమ్, నిమ్మనగోటి శ్రీను, నాయకులు కూరెళ్ళ లింగస్వామి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్, జిట్ట బొందయ్య, ఆవుల ఆనంద్, జమాన్ల శ్రీనివాసరెడ్డి, బొలుగురు సైదులు, రాగుల వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.