BREAKING
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం మంచిర్యాలలో అకాల వర్షం: ప్రజలకు ఉపశమనం.. రైతులకు ఆందోళన
www.ntodaynews.com

​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 May, 2026 - 07:27 PM
10 వీక్షణలు

​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ 

మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు నాయకులు, కార్యకర్తలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం పరామర్శించారు. ​రెండవ వార్డుకు చెందిన మహమ్మద్ గౌస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం ఇంటి వద్దే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరుమర్తి లింగయ్య ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. గౌస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, అధైర్యపడొద్దని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని భరోసా ఇచ్చారు. ​అదేవిధంగా, 10వ వార్డుకు చెందిన గంధమల్ల శంకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను కూడా మాజీ ఎమ్మెల్యే పరామర్శించి, అందుతున్న వైద్య సహాయం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లూ  ఎస్.కె. షబానా అజీమ్,  నిమ్మనగోటి శ్రీను, నాయకులు కూరెళ్ళ లింగస్వామి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్, జిట్ట బొందయ్య,  ఆవుల ఆనంద్, జమాన్ల శ్రీనివాసరెడ్డి, బొలుగురు సైదులు, రాగుల వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.