BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 08:35 PM
8 వీక్షణలు

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన: డాక్టర్ అయూబ్ ఖాన్

అన్నమయ్య జిల్లా. పుంగనూరు 

 స్థానిక బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మరుగుదొడ్ల వద్ద ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని డాక్టర్ పి అయూబ్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థినులు చదువుకునే ఈ ప్రతిష్టాత్మక కళాశాలలో మరుగుదొడ్ల సమీపంలో గోడ లేకపోవడం వల్ల బాలికల రక్షణ, గోప్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రహరీ గోడ లేని కారణంగా ఆకతాయిల సంచారం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థినులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి, అత్యవసర నిధులు కేటాయించి ప్రహరీ గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే, విద్యార్థినుల భద్రత కోసం అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.