BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 08:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 08:35 PM
88 వీక్షణలు

బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన: డాక్టర్ అయూబ్ ఖాన్

అన్నమయ్య జిల్లా. పుంగనూరు 

 స్థానిక బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మరుగుదొడ్ల వద్ద ప్రహరీ గోడ కూలిపోయి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని డాక్టర్ పి అయూబ్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందలాది మంది విద్యార్థినులు చదువుకునే ఈ ప్రతిష్టాత్మక కళాశాలలో మరుగుదొడ్ల సమీపంలో గోడ లేకపోవడం వల్ల బాలికల రక్షణ, గోప్యత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రహరీ గోడ లేని కారణంగా ఆకతాయిల సంచారం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థినులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి, అత్యవసర నిధులు కేటాయించి ప్రహరీ గోడను నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా పనులు ప్రారంభించకపోతే, విద్యార్థినుల భద్రత కోసం అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.