BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 07:25 PM
107 వీక్షణలు

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, ఎవరూ కూడా వీటిని ప్రోత్సహించవద్దని వట్టిమర్తి గ్రామ సర్పంచ్ మేడి శ్రీలత పిలుపునిచ్చారు.చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఐసీడీఎస్  ఆధ్వర్యంలో 'బాలల పరిరక్షణ' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సర్పంచ్ శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి ఆచారాలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని 14 సంవత్సరాలు నిండిన బాలికల తల్లిదండ్రుల నుండి సేకరించిన కీలక వాగ్దాన పత్రాలను సర్పంచ్ ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. తమ కుమార్తెలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు జరిపిస్తామని తల్లిదండ్రులు ఈ పత్రాల ద్వారా లిఖితపూర్వకంగా వాగ్దానం చేశారు. ​ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ, ఇందిర, ఆశా కార్యకర్త రజితతో పాటు గ్రామానికి చెందిన గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు  పాల్గొన్నారు.