BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​బీసీ మంత్రులను అవమానించిన పొంగులేటి బహిరంగ క్షమాపణ చెప్పాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 03:41 PM
154 వీక్షణలు

పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్

​మంచిర్యాల జిల్లా నేత మహేష్ వర్మ హెచ్చరిక


​మంచిర్యాల: తోటి మంత్రులనే గౌరవించని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా నాయకుడు మహేష్ వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీ మంత్రుల పట్ల అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తూ కొందరు శునకానందాన్ని పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. అగ్రవర్ణాల నాయకులు బీసీల పట్ల చూపుతున్న వివక్ష స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

​సొంత క్యాబినెట్ లోని బీసీ మంత్రులకే ఇలాంటి అవమానాలు జరుగుతుంటే.. తోటి బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించకపోవడం బీసీ సమాజానికే సిగ్గుచేటని మహేష్ వర్మ విమర్శించారు. కేవలం పదవుల కోసమే ఆత్మగౌరవాన్ని చంపుకుని వారు పదవుల్లో కొనసాగుతున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. బీసీల పక్షాన బలమైన నాయకుడు తీన్మార్ మల్లన్న ఉన్నారని, బీసీ నాయకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

​బీసీలను తక్కువ చేసి చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో బీసీ, బహుజనుల రాజ్యాధికారం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగా బీసీ మంత్రులకు, బీసీ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మంచిర్యాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ సంఘాలను, నాయకులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహేష్ వర్మ హెచ్చరించారు