BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​బెల్లంపల్లి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 May, 2026 - 03:06 PM
179 వీక్షణలు

కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు: వడ్ల కేంద్రాల వద్ద ఎండలోనే పడికాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు

ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు సకాలంలో సాగకపోవడంతో, అన్నదాతలు ఈ కరుడుగట్టే ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్దే పడికాపులు కాయాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.

​బెల్లంపల్లి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మండలాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఈ సందర్భంగా కోడి రమేష్ తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్యే వస్తున్నారంటే చాలు... ఇక్కడి స్థానిక నాయకులు రైతుల సమస్యలను గాలికొదిలేసి, వారి కోసం దావత్‌లు (విందులు) ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా, విందుల కోసం మేకలు, పొట్టేలను బలి ఇవ్వడానికి కార్యాచరణలు రూపొందించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులకు, పాలకులకు రైతుల కన్నీళ్లు కనబడడం లేదా అని ఆయన ధ్వజమెత్తారు