బుగత తిరుపతికీ మంత్రి చేతులు మీదుగా ప్రసంసాపత్రం
బి.జె.పురం గ్రామానికి చెందిన బుగత తిరుపతికీ మంత్రి చేతులు మీదుగా ప్రసంసాపత్రం
ఉత్తమ సేవలకు గుర్తింపు.. బుగత తిరుపతికి ప్రశంసా పత్రం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఉత్తమ సేవలకు గుర్తింపుగా బి.జె.పురం గ్రామానికి చెందిన బుగత తిరుపతి (అనంత్) ప్రశంసా పత్రం అందుకున్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా మేజిస్ట్రేట్ & కలెక్టర్ శ్రీ ఎన్. ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి మండల రమా శంకర్ రావు బుగత తిరుపతి (అనంత్)ను అభినందిస్తూ, ఉత్తమ సేవలకు గుర్తింపు లభించడం బి.జె.పురం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు తిరుపతికీ ఉన్నా నిబద్దత పట్ల హార్షం వ్యక్తం చేస్తున్నారు.