బ్లూ ప్రింట్పై అవగాహన పెంచుకోవాలి
బ్లూ ప్రింట్పై అవగాహన పెంచుకోవాలి
పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్షపై మార్గదర్శనం
తిరువూరు, ఆగస్టు 5 (న్యూస్): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన మిషన్ మార్చ్–2027 కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్షా విధానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం. రాం ప్రదీప్ మాట్లాడుతూ, విద్యార్థులు ముందుగా బ్లూ ప్రింట్ను పూర్తిగా అధ్యయనం చేసి పరీక్షా సరళిపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్లూ ప్రింట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. అలాగే ఇంగ్లీష్ పరీక్షలో వర్క్బుక్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున దానిని నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా చదవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు పి. పద్మావతి, ఆంగ్ల ఉపాధ్యాయిని కె. నిశిత పాల్గొని విద్యార్థులకు పరీక్షా సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.