BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

బండారి మమత చదువుకు అండగా నిలిచిన హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:44 AM
21 వీక్షణలు

కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలానికి చెందిన బండారి మమత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన విద్యార్థిని. కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఉండగా, మమత రెండో కుమార్తె. తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లి జీవనం సాగిస్తుండటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యను కొనసాగించడం కష్టంగా మారడంతో మమత తీవ్ర ఆందోళనకు గురైంది.

మమత పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అనంతరం ఆర్‌డీటీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మమతకు రూ.40 వేల సెమీ స్కాలర్‌షిప్ మంజూరు అయ్యేలా సహకరించారు.

అలాగే మమత పరిస్థితిని తెలుసుకున్న హొళగుంద ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్ మానవత్వంతో స్పందించి ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా మిగిలిన ఫీజు, సీటు వ్యవహారాలపై కర్నూలు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో చర్చించి మమత చదువు కొనసాగేందుకు తోడ్పడ్డారు.

తన చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, హొళగుంద ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్, ఆర్‌డీటీ సంస్థ, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి బండారి మమత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, “పేదరికం చదువుకు అడ్డంకి కాదు. సమాజం అండగా ఉంటే ప్రతిభ తప్పకుండా విజయం సాధిస్తుంది” అని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.