BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

బండారి మమత చదువుకు అండగా నిలిచిన హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:44 AM
77 వీక్షణలు

కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలానికి చెందిన బండారి మమత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన విద్యార్థిని. కుటుంబంలో నలుగురు కుమార్తెలు ఉండగా, మమత రెండో కుమార్తె. తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లి జీవనం సాగిస్తుండటంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యను కొనసాగించడం కష్టంగా మారడంతో మమత తీవ్ర ఆందోళనకు గురైంది.

మమత పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. అనంతరం ఆర్‌డీటీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి మమతకు రూ.40 వేల సెమీ స్కాలర్‌షిప్ మంజూరు అయ్యేలా సహకరించారు.

అలాగే మమత పరిస్థితిని తెలుసుకున్న హొళగుంద ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్ మానవత్వంతో స్పందించి ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా మిగిలిన ఫీజు, సీటు వ్యవహారాలపై కర్నూలు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో చర్చించి మమత చదువు కొనసాగేందుకు తోడ్పడ్డారు.

తన చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, హొళగుంద ఎస్‌ఐ గురజాల దిలీప్ కుమార్, ఆర్‌డీటీ సంస్థ, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యానికి బండారి మమత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, “పేదరికం చదువుకు అడ్డంకి కాదు. సమాజం అండగా ఉంటే ప్రతిభ తప్పకుండా విజయం సాధిస్తుంది” అని పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.