బంగారం ధరలకు బ్రేక్ : భారీగా తగ్గిన పసిడివీ ధర
బంగారం ధరలకు బ్రేక్ : భారీగా తగ్గిన పసిడివీ ధర
గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలతో పాటు, డాలర్ బలోపేతం కావడంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేవలం మూడు వారాల వ్యవధిలోనే సుమారు 15 శాతం మేర ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం నల్గొండ మరియు హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు కు నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు నేడు 1,45,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర సుమారు 2,45,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం మరియు ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం ఈ తగ్గుదల కనిపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ చమురు ధరలు పెరగడం కూడా పరోక్షంగా పసిడిపై ప్రభావం చూపుతోంది.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో, ధరల పతనం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. మార్చి మొదటి వారంలో తులం బంగారం ₹ 1,73,000 మార్కును తాకగా, ఇప్పుడు అది ₹ 1.45 లక్షల స్థాయికి చేరడం కొనుగోలుదారులకు మంచి అవకాశమని జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు.