BREAKING
మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి....
www.ntodaynews.com

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 05:21 PM
110 వీక్షణలు

బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్, గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, తడి చెత్త, పొడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడే వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి, వాటిని రైతన్నలకు అందించాలనే ప్రణాళికను ప్రస్తావించారు. ఇది సహజ సిద్ధమైన ఎరువుగా పంటలకు మంచి పోషకాలు అందించి, పంట నాణ్యత పెరగడానికీ, రైతులకు మేలు చేకూర్చే దిశగా ఉండేలా చూడాలని సూచించారు.

అనంతరం, గ్రామ కార్యదర్శి రాజగోపాల్ ను, గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూసుకోవడం, వీధిలైట్లు సక్రమంగా వెలగాలని, అలాగే వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని పలు సూచనలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.