బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం
బూరుగుగూడెంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి మాసగిరి శ్రీనివాస్, గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, తడి చెత్త, పొడి చెత్త ద్వారా రైతులకు ఉపయోగపడే వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి, వాటిని రైతన్నలకు అందించాలనే ప్రణాళికను ప్రస్తావించారు. ఇది సహజ సిద్ధమైన ఎరువుగా పంటలకు మంచి పోషకాలు అందించి, పంట నాణ్యత పెరగడానికీ, రైతులకు మేలు చేకూర్చే దిశగా ఉండేలా చూడాలని సూచించారు.
అనంతరం, గ్రామ కార్యదర్శి రాజగోపాల్ ను, గ్రామంలో మంచినీటి కొరత లేకుండా చూసుకోవడం, వీధిలైట్లు సక్రమంగా వెలగాలని, అలాగే వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని పలు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు.