BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:55 PM
147 వీక్షణలు

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఫాదర్ రెవరెండ్ పోలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ చర్చ్ సేవా భావం, సమాజంలో ప్రేమ, ఐక్యత, సహకారం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక విలువలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆత్మీయతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, యువత కూడా సేవా భావంతో ముందుకు రావాలని తెలిపారు.

అలాగే ఉమ్మడి సీతారాములు, కాలసాని సూర్య నారాయణ మాట్లాడుతూ సమాజంలో మత సమన్వయం, పరస్పర గౌరవం పెంపొందాలని పేర్కొన్నారు.

ఇంకా రాజబోయిన దశరధ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, గోవర్ధన రెడ్డి, సుబ్బారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.