BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:55 PM
105 వీక్షణలు

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఫాదర్ రెవరెండ్ పోలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ చర్చ్ సేవా భావం, సమాజంలో ప్రేమ, ఐక్యత, సహకారం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక విలువలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆత్మీయతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, యువత కూడా సేవా భావంతో ముందుకు రావాలని తెలిపారు.

అలాగే ఉమ్మడి సీతారాములు, కాలసాని సూర్య నారాయణ మాట్లాడుతూ సమాజంలో మత సమన్వయం, పరస్పర గౌరవం పెంపొందాలని పేర్కొన్నారు.

ఇంకా రాజబోయిన దశరధ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, గోవర్ధన రెడ్డి, సుబ్బారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.