BREAKING
తృప్తి కాంటీన్ ను తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్ మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! జలవనరులు శాఖ కు సంబందించిన ఆక్రమణ స్థలాలు,అక్రమ కట్టడాలును వెంటనే తొలగించండి బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ తృప్తి కాంటీన్ ను తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్ మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! జలవనరులు శాఖ కు సంబందించిన ఆక్రమణ స్థలాలు,అక్రమ కట్టడాలును వెంటనే తొలగించండి బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
www.ntodaynews.com

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:55 PM
40 వీక్షణలు

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఫాదర్ రెవరెండ్ పోలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ చర్చ్ సేవా భావం, సమాజంలో ప్రేమ, ఐక్యత, సహకారం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక విలువలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆత్మీయతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, యువత కూడా సేవా భావంతో ముందుకు రావాలని తెలిపారు.

అలాగే ఉమ్మడి సీతారాములు, కాలసాని సూర్య నారాయణ మాట్లాడుతూ సమాజంలో మత సమన్వయం, పరస్పర గౌరవం పెంపొందాలని పేర్కొన్నారు.

ఇంకా రాజబోయిన దశరధ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, గోవర్ధన రెడ్డి, సుబ్బారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.