BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:55 PM
80 వీక్షణలు

బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఫాదర్ రెవరెండ్ పోలిశెట్టి జయరాజు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ చర్చ్ సేవా భావం, సమాజంలో ప్రేమ, ఐక్యత, సహకారం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక విలువలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఆత్మీయతను మరింత పెంచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద దేశిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, యువత కూడా సేవా భావంతో ముందుకు రావాలని తెలిపారు.

అలాగే ఉమ్మడి సీతారాములు, కాలసాని సూర్య నారాయణ మాట్లాడుతూ సమాజంలో మత సమన్వయం, పరస్పర గౌరవం పెంపొందాలని పేర్కొన్నారు.

ఇంకా రాజబోయిన దశరధ రామరాజు, జనసేన నాయకుడు వెల్లంకి శ్రీమన్నారాయణ, గోవర్ధన రెడ్డి, సుబ్బారావు, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.