BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:35 PM
155 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్ట్రాయి మండల పరిధిలో మండల స్థాయిలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో చిత్తపూరు గ్రామం తరఫున జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీఎల్ఓ, బీఎల్ఏల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు ధృవీకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా వలసలు వెళ్లిన వారి ఓట్లు, మరణించిన వారి పేర్లపై ఉన్న ఓట్లు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి పరిశీలన అనంతరం తొలగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో మరణించిన వ్యక్తుల ఓట్ల తొలగింపుకు డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి కాగా, కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్ల అంగీకారం, సంతకాలతో కూడా ఓటును తొలగించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

అలాగే నియోజకవర్గ స్థాయిలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో త్వరలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ కమిటీ ఏజెంట్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వలసపల్లి రామకృష్ణ, బత్తుల శివ, జంగాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

— చాట్రాయి మండల జనసేన పార్టీ.