BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

భారత్‌లో మరోసారి చరిత్రను తడిమిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Mar, 2026 - 02:26 PM
240 వీక్షణలు

భారత్‌లో మరోసారి చరిత్రను తడిమిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది

రెండో ప్రపంచ యుద్ధం కాలానికి చెందిన భారీ బాంబులు సుమారు 80 ఏళ్ల తర్వాత బయటపడటం కలకలం రేపుతోంది.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా పరిధిలోని బహరాగోరా ప్రాంతంలో, స్వర్ణరేఖ నది ఒడ్డున ఇసుక తవ్వకాల సమయంలో ఈ బాంబులు వెలుగులోకి వచ్చాయి. మొదట ఇవి సాధారణ ఇనుప ముక్కలుగా భావించిన స్థానికులు, తరువాత అవి భారీ పేలుడు సామగ్రి అని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.

అధికారుల పరిశీలనలో ఒక్కో బాంబు సుమారు 227 కిలోల బరువు కలిగి ఉన్నట్లు తేలింది. దాదాపు 80 ఏళ్లుగా ఇసుకలో పాతుకుపోయినా అవి పేలని స్థితిలో ఉండటం ఆందోళనకు గురిచేసింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సమాచారం అందుకున్న భారత సైన్యానికి చెందిన బాంబు నిర్వీర్య దళం సంఘటనా స్థలానికి చేరుకుని, అత్యంత జాగ్రత్తలతో రెండు బాంబులను సురక్షితంగా నిర్వీర్యం చేసింది. నిపుణుల ప్రకారం, ఇవి పేలిపోయి ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించే ప్రమాదం ఉంది.

పరిశీలనలో ఈ బాంబులు AN-M64 బాంబు మోడల్‌కు చెందినవిగా గుర్తించారు. ఇవి అమెరికాలో తయారైన వైమానిక బాంబులు కాగా, “Made in USA” అనే గుర్తులు కూడా స్పష్టంగా కనిపించాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ విమానాల ద్వారా లక్ష్యాలపై విసిరేందుకు వీటిని ఉపయోగించేవారు.

ఈ బాంబులు అక్కడికి ఎలా చేరాయి అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం, యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ సైనిక విమానాలు భారత తూర్పు ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లను ఉపయోగించేవి. అక్కడి నుంచి బర్మా (ప్రస్తుతం మయన్మార్), చైనా వైపు వెళ్లే సమయంలో సాంకేతిక లోపం లేదా ప్రమాదం వల్ల ఈ బాంబులు నదిలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

1939 నుంచి 1945 వరకు కొనసాగిన రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత విధ్వంసకర యుద్ధంగా గుర్తింపు పొందింది. యూరప్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలతో పాటు పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల్లో కూడా ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఆసియా ప్రాంతంలో ముఖ్యంగా చైనా, జపాన్, బర్మా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ సమయంలో భారత తూర్పు ప్రాంతాలు మిత్రదేశాల సైనిక కార్యకలాపాలకు కీలక కేంద్రాలుగా నిలిచాయి.

దీంతో ఒడిశా, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ అప్పటి యుద్ధానికి సంబంధించిన పేలని బాంబులు, విమాన అవశేషాలు అప్పుడప్పుడు బయటపడుతుండటం గమనార్హం.