విశ్వబంధుగా మరోసారి భారత్.. వెనిజులాకు ‘ఆపరేషన్ అమిస్టాడ్’తో భారీ సాయం
భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన వెనిజులాకు భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఆపదలో ఉన్న దేశాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది.
ఈ ఆపరేషన్లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 గ్లోబ్మాస్టర్ విమానాల ద్వారా 35 టన్నులకు పైగా అత్యవసర మందులు, వైద్య పరికరాలను వెనిజులాకు తరలించారు. అలాగే భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్తో పాటు రెండు ‘భీష్మ్ క్యూబ్స్’ మొబైల్ ఆసుపత్రులను కూడా పంపించారు.
విపత్తు సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడం, ప్రాణాలను కాపాడడమే ఈ సహాయక చర్యల ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆపదలో ఉన్న దేశాలకు మానవతా సహాయం అందించడంలో భారత్ మరోసారి తన బాధ్యతను చాటుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.