BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 06:03 PM
38 వీక్షణలు

లక్సెట్టిపేట:-భార్య కాపురానికి రావడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చందారం గ్రామానికి చెందిన కోడి నరేష్ (33)కు, అతని భార్యకు గత రెండు నెలలుగా కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన భార్య, తన కుమారుడిని తీసుకొని లక్సెట్టిపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం, తిరిగి కాపురానికి రావడానికి నిరాకరించడంతో నరేష్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై మద్యానికి బానిసయ్యాడు.

​బావిలో దూకి బలవన్మరణం

​జీవితంపై విరక్తి చెందిన నరేష్, ఆదివారం తన ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. నరేష్ మృతితో చందారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి