BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​భార్య కాపురానికి రాలేదని లక్సెట్టిపేటలో వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 06:03 PM
99 వీక్షణలు

లక్సెట్టిపేట:-భార్య కాపురానికి రావడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన లక్సెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చందారం గ్రామానికి చెందిన కోడి నరేష్ (33)కు, అతని భార్యకు గత రెండు నెలలుగా కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన భార్య, తన కుమారుడిని తీసుకొని లక్సెట్టిపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం, తిరిగి కాపురానికి రావడానికి నిరాకరించడంతో నరేష్ తీవ్ర మానసిక ఆందోళనకు గురై మద్యానికి బానిసయ్యాడు.

​బావిలో దూకి బలవన్మరణం

​జీవితంపై విరక్తి చెందిన నరేష్, ఆదివారం తన ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు. నరేష్ మృతితో చందారం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి