BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

భద్రాచలం: గంజాయి కేసులో నిందితుడు పరారీ..

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 10:35 AM
21 వీక్షణలు

భద్రాచలం: గంజాయి కేసులో నిందితుడు పరారీ.. రికార్డుల మార్పుల ఆరోపణలు

ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓపై వేటు.. శాఖాపరమైన విచారణకు ఆదేశాలు

భద్రాచలం నిషేధ & ఎక్సైజ్‌ స్టేషన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ శాఖలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎండు గంజాయి కేసులో నిందితుడు అధికారుల అదుపు నుంచి తప్పించుకోవడం, కేసుకు సంబంధించిన పత్రాల నిర్వహణలో లోపాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎస్‌కే రహీమున్నీసా బేగంపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ వ్యవహారంపై సమగ్ర శాఖాపరమైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

గంజాయి కేసులో నిందితుడు తప్పించుకున్న ఘటన

ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నిర్వహించిన తనిఖీల్లో 2026 ఆగస్టు 4న ఎండు గంజాయి కేసు బయటపడింది. ఈ కేసును భద్రాచలం నిషేధ & ఎక్సైజ్‌ స్టేషన్‌లో నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే వారిలో ఒకరైన ఏ1 నిందితుడు మాధబ హంతల్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ అదుపులో ఉండగా తప్పించుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున సుమారు 5.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

కేసు రికార్డులపై అనుమానాలు

నిందితుడు పరారీ కావడం మాత్రమే కాకుండా.. కేసుకు సంబంధించిన పంచనామా, ఇతర రికార్డుల నిర్వహణలో మార్పులు జరిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. రికార్డుల్లో తేడాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై ఖమ్మం నిషేధ & ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలుస్తోంది. సంబంధిత కేసు పత్రాలు, ఇతర ఆధారాలను కూడా నివేదికతో పాటు పంపినట్లు సమాచారం.

బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం

విధుల్లో నిర్లక్ష్యం, నిందితుడి పరారీ, రికార్డుల నిర్వహణలో లోపాలపై శాఖ కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎస్‌హెచ్‌ఓపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత సిబ్బంది పాత్రపై కూడా విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.

విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా?

భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌ వ్యవహారం ప్రస్తుతం శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. నిందితుడు ఎలా తప్పించుకున్నాడు? రికార్డుల్లో మార్పులకు కారణాలేమిటి? విధి నిర్వహణలో ఎవరి నిర్లక్ష్యం ఉంది? అనే అంశాలపై శాఖాపరమైన విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విచారణ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు ఉంటాయా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.