www.ntodaynews.com
శ్రీశైలంలో భక్తిరంజని సాంస్కృతిక కార్యక్రమం
తెలంగాణ
శ్రీశైలంలో భక్తిరంజని సాంస్కృతిక కార్యక్రమం
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్యకళారాధన వేదికపై భక్తిరంజని సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడింది. కర్నూలుకు చెందిన ఎ. భాగ్యలక్ష్మి మరియు వారి బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంత్రం ఈ కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మికంగా అలరించింది. కార్యక్రమంలో గణపతిని సేవింపరారే, కైలాసనాథ శ్రీగిరివాసా, భో శంభో శివశంభో, శంభో మహాదేవ, నమశ్శివాయ నటేశ్వరాయ, సాంబశివ సదాశివ వంటి శివకీర్తనలను భాగ్యలక్ష్మి, పుష్పలీలావతి, గాయత్రి ఆలాపించారు.
ఈ కార్యక్రమానికి వయోలిన్పై రమణయ్య, తబలాపై వెంకటేశ్వర్లు సంగీత సహకారం అందించారు.
దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యాలు, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ స్వామి, అమ్మవార్లకు జరిగే కైంకర్యాలు పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది.
#Srisailam #BhakthiRanjani #CulturalPrograms #TempleNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube