www.ntodaynews.com
భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
తెలంగాణ
/
ఆదిలాబాద్
భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్.. రిమాండ్కు తరలింపు
ఆదిలాబాద్ రూరల్ మండలం లోహారలో సంచలనం చోటుచేసుకుంది. భర్త గణపతి (54)ను హత్య చేసిన భార్య సోలంకి మధురాబాయి (52)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మద్యానికి బానిసైన గణపతి తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో మధురాబాయి ఇనుప రాడ్తో అతని తలపై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ కె. ఫణిధర్ వెల్లడించారు.
మృతుడి కుమారుడు సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు.