www.ntodaynews.com
హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం
తెలంగాణ
హుజూరాబాద్ 27వ వార్డులో బీజేపీ ప్రచారం ఉధృతం
అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్–కాంగ్రెస్పై ధ్వజం
NTODAY NEWS: రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ రిపోర్టర్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో బీజేపీ అభ్యర్థి తాళ్లపల్లి దేవేంద్ర ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె స్థానికులను కలుసుకుని తమ సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను మభ్యపెట్టే మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గానీ, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గానీ 27వ వార్డుకు గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
వార్డులో ఉన్న మౌలిక వసతుల సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 27వ వార్డు బీజేపీ ఇంచార్జ్ సంపత్ కుమార్, జంపాల సువర్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Huzurabad
#KarimnagarDistrict
#MunicipalElections
#BJPCampaign
#Ward27
#LocalElections
#TelanganaPolitics
Follow us on
Website
Facebook
Instagram
YouTube