BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ధర్మపురిలో వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ

తెలంగాణ
27 Feb, 2026 - 08:51 AM
136 వీక్షణలు
ధర్మపురిలో వైభవంగా బ్రహ్మోత్సవాల అంకురార్పణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పుట్ట బంగారం సేకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి: క్షేత్రనాథుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ‘పుట్ట బంగారం’ సేకరణ బ్రహ్మోత్సవాల ఆనవాయితీ ప్రకారం పట్టణంలోని చింతామణి చెరువు గట్టు వద్ద పుట్ట బంగారం సేకరించడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆలయం నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా చెరువు గట్టుకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్ట బంగారాన్ని సేకరించారు. దీంతో ఉత్సవాలకు శుభారంభం లభించింది. భక్తులకు పూర్తి సదుపాయాలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, దేవాలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. #Dharmapuri #Brahmotsavam #LakshmiNarasimhaSwamy #TempleFestival #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube