www.ntodaynews.com
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు
తెలంగాణ
వృద్ధులు, చిన్నారుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం రూ.50 కోట్లతో 7 వేల మందికి ఉపకరణాల పంపిణీ NTODAY NEWS: హైదరాబాద్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు, ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి రూ.43.22 కోట్ల విలువైన ఉపకరణాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు.
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామం’ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే చిన్నారుల కోసం ‘బాల భరోసా’ పథకం ద్వారా ముందస్తు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, సమాన అవకాశాలతో కూడిన తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
#TelanganaRising
#PrajaPalana
#DisabilityWelfare
#InclusiveGrowth
#SocialWelfare
#ChildWelfare
#ElderlyCare
#TelanganaGovernment
Follow us on
Website
Facebook
Instagram
YouTube 