చాట్రాయి గ్రామ వాసికి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక చాట్రాయి గ్రామానికి చెందిన అంబటి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాలతో ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.85,645 విలువైన చెక్ను అంబటి శివశంకర్కు అందజేశారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్ చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా అంబటి శివశంకర్ మాట్లాడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్య సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.