www.ntodaynews.com
చాట్రాయి మండల రైతులకు వ్యవసాయ అధికారి బి శివశంకర్ ముఖ్య సూచన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి మండల రైతులకు వ్యవసాయ అధికారి బి శివశంకర్ ముఖ్య సూచన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపిన ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రైతులు వరి ధాన్యం, మొక్కజొన్న గింజలు తడవకుండా టార్పాలిన్స్ ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే కోతకు సిద్ధమైన పంటను వీలైతే సురక్షితంగా నిల్వ చేయాలి.
వరి కోత ప్రారంభించని రైతులు మూడు రోజులపాటు కోతలను వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. పరిస్థితులను పరిశీలించి, అనుకూల సమయాన్ని చూసుకొని కోతలు చేపట్టాలని తెలిపారు.