చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్
చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్
నవోదయం–2.0లో భాగంగా నాటు సారాపై కఠిన చర్యలు – 6 మందిపై బైండ్ ఓవర్
నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో నూజివీడు పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు. ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని, ఆ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించబడుతుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా రద్దు చేయబడతాయని తహసీల్దార్ హెచ్చరించారు.
బైండ్ ఓవర్ చేయబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:
వజ్రపు రాంబాబు (పోతనపల్లి), బెజవాడ శ్రీనివాసరావు (జనార్ధనవరం), ఈడ అర్జున్ రావు (పోలవరం), కలవకోల్లు రెడ్డయ్య (పోలవరం), పామర్తి నాగరాజు (టీ గుడిపాడు), గాదే రాటాలు (పోలవరం).
అదేవిధంగా నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊట్లు కలిగిన భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.