BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:47 PM
56 వీక్షణలు

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్ 

నవోదయం–2.0లో భాగంగా నాటు సారాపై కఠిన చర్యలు – 6 మందిపై బైండ్ ఓవర్

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో నూజివీడు పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు. ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని, ఆ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించబడుతుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా రద్దు చేయబడతాయని తహసీల్దార్ హెచ్చరించారు.

బైండ్ ఓవర్ చేయబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:

వజ్రపు రాంబాబు (పోతనపల్లి), బెజవాడ శ్రీనివాసరావు (జనార్ధనవరం), ఈడ అర్జున్ రావు (పోలవరం), కలవకోల్లు రెడ్డయ్య (పోలవరం), పామర్తి నాగరాజు (టీ గుడిపాడు), గాదే రాటాలు (పోలవరం).

అదేవిధంగా నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊట్లు కలిగిన భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.