BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Apr, 2026 - 07:47 PM
85 వీక్షణలు

చాట్రాయి మండలం లో ఎక్సైజ్ పాత నేరస్తులు ఆరుగురు బైండోవర్ 

నవోదయం–2.0లో భాగంగా నాటు సారాపై కఠిన చర్యలు – 6 మందిపై బైండ్ ఓవర్

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో నూజివీడు పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు. ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని, ఆ కాలంలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించబడుతుందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా రద్దు చేయబడతాయని తహసీల్దార్ హెచ్చరించారు.

బైండ్ ఓవర్ చేయబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి:

వజ్రపు రాంబాబు (పోతనపల్లి), బెజవాడ శ్రీనివాసరావు (జనార్ధనవరం), ఈడ అర్జున్ రావు (పోలవరం), కలవకోల్లు రెడ్డయ్య (పోలవరం), పామర్తి నాగరాజు (టీ గుడిపాడు), గాదే రాటాలు (పోలవరం).

అదేవిధంగా నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, అలాగే బెల్లపు ఊట్లు కలిగిన భూస్వాములపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.