చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం
చాట్రాయి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సమాచారం
ఈ రబీ సీజన్లో, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో 2800 ఎకరాల వరి సాగు చేపట్టబడిందని ప్రస్తుతం పంట కోత దశకు చేరుకున్నందున, రైతులు తమ ధాన్యాన్ని తేమ శాతం 17% వచ్చే వరకు ఆరబెట్టినపిదప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి గోనె సంచులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గరిష్ట ఎం.ఎస్.పి ధరను పొందేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రస్తుతం చాట్రాయి మండలంలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు లో ఉన్నాయని చాట్రాయి, తుమ్మగూడెం, పోలవరం, పోతనపల్లి, చీపురుగూడెం (పిపిసి). ఈ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతుందని. గోనె సంచులు కావలసిన రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల వద్ద వాటిని పొందవలెనని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఎం.ఎస్.పి ధరలు: గ్రేడ్ A: రు.2389 /, క్వింటాల్ కు, కామన్ రకం రు.2369 / క్వింటాల్ కు మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు తమ ధాన్యం ఎం.ఎస్.పి ధరకు విక్రయించి ప్రభుత్వ ధరలను పొందగలరని తెలియజేశారు