BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

చాట్రాయి మండలంలో వైసీపీ నిరసన హోరు – “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:49 PM
156 వీక్షణలు

రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం చాట్రాయి మండలంలో ఉధృతంగా సాగింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన స్వరాన్ని మరింత బలంగా వినిపించాయి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని నేతలు ఆరోపించారు. కార్యక్రమం సందర్భంగా నినాదాలతో ప్రాంతం హోరెత్తి, రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిరెడ్డి రాఘవరెడ్డి, చెలికాని బాబ్జీ, పుచ్చకాయల సుబ్బారెడ్డి, కారంగుల శ్రీనివాసరావు, మిద్దె శివాజి, పరసా చెన్నా రావు, మాదల నరసింహారావు, గడ్డం లోకేశ్వర రెడ్డి, గడ్డం శ్రీనివాస రెడ్డి, నెల్లూరి  రాజేష్, రామకృష్ణ ,వేణు, గడ్డం నరసింహా రెడ్డి, గడ్డం రాజశేఖర రెడ్డి, ములగాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు