BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 06:22 PM
69 వీక్షణలు

చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు.

సెప్టెంబర్ 15వ తేదీలోపు ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పూర్తి వివరాలతో తమ గ్రామంలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) వద్ద ఈ-పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.

అలాగే వరి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా ఆగస్టు 31వ తేదీలోపు ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఎకరానికి రూ.840 చెల్లిస్తే పంట బీమా వర్తిస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా చనుబండ గ్రామంలోని వరి పొలాలను వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతులకు నీటి యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.

ఈ క్షేత్ర సందర్శనలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగమణి, రైతులు, నక్క రాము తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పంటల నమోదు, బీమా ప్రక్రియలను సకాలంలో పూర్తిచేసుకోవాలని అధికారులు కోరారు.