చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్
చాట్రాయి: రైతులు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలి ఏవో బి శివశంకర్
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు.
సెప్టెంబర్ 15వ తేదీలోపు ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పూర్తి వివరాలతో తమ గ్రామంలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) వద్ద ఈ-పంట నమోదు చేసుకోవాలని తెలిపారు.
అలాగే వరి సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా ఆగస్టు 31వ తేదీలోపు ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఎకరానికి రూ.840 చెల్లిస్తే పంట బీమా వర్తిస్తుందని వివరించారు.
ఈ సందర్భంగా చనుబండ గ్రామంలోని వరి పొలాలను వ్యవసాయ అధికారి పరిశీలించారు. రైతులకు నీటి యాజమాన్య పద్ధతులు, పంట మార్పిడి విధానం, ఆరుతడి పంటల సాగు, ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
ఈ క్షేత్ర సందర్శనలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు నాగమణి, రైతులు, నక్క రాము తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పంటల నమోదు, బీమా ప్రక్రియలను సకాలంలో పూర్తిచేసుకోవాలని అధికారులు కోరారు.