BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

చాట్రాయిలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
102 వీక్షణలు

చాట్రాయి, ఆగస్టు 5: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుందని, ఒక ఎకరానికి వరి పంటకు రూ.840, మినుము పంటకు రూ.300 ప్రీమియంగా నిర్ణయించినట్లు వివరించారు.

రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్‌లు, రిటైల్ దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్‌ఆర్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతుందని వివరించారు.

అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ జీవామృతం, ఘనజీవామృతం వినియోగం వల్ల మొక్కలు సుమారు 15 రోజుల వరకు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పొందుతాయని రైతులకు సూచించారు.