BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చాట్రాయిలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
90 వీక్షణలు

చాట్రాయి, ఆగస్టు 5: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చాట్రాయి గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నీనో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుందని, ఒక ఎకరానికి వరి పంటకు రూ.840, మినుము పంటకు రూ.300 ప్రీమియంగా నిర్ణయించినట్లు వివరించారు.

రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు పీఏసీఎస్‌లు, రిటైల్ దుకాణాల్లో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఏఐఎంఎస్ యాప్, ఏపీఎఫ్‌ఆర్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతుందని వివరించారు.

అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ జీవామృతం, ఘనజీవామృతం వినియోగం వల్ల మొక్కలు సుమారు 15 రోజుల వరకు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం పొందుతాయని రైతులకు సూచించారు.