BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

చెన్నూరు నియోజకవర్గంలో నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక అవగాహన సదస్సు

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 May, 2026 - 04:48 PM
66 వీక్షణలు

రైతులు అప్రమత్తంగా ఉండాలి – అనధికారిక విత్తనాల కొనుగోలు, అమ్మకాలపై కఠిన చర్యలు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో నకిలీ,అనధికారిక పత్తి విత్తనాల రవాణా, నిల్వ,అమ్మకం మరియు కొనుగోళ్లను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ,పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కిష్టంపేట్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల నుంచే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.నకిలీ మరియు అనధికారిక విత్తనాల వాడకం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని తెలిపారు.విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవడం, ప్యాకెట్‌పై కంపెనీ పేరు,లాట్ నంబర్, గడువుతేదీ తదితర వివరాలను పరిశీలించడం తప్పనిసరి అని వివరించారు. అనుమానాస్పదంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అనధికారికంగా పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం, అమ్మకం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ సిబ్బంది,పోలీస్ అధికారులు,రైతులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.