BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

చెన్నూరు నియోజకవర్గంలో నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక అవగాహన సదస్సు

తెలంగాణ
/ మంచిర్యాల / చెన్నూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 May, 2026 - 04:48 PM
20 వీక్షణలు

రైతులు అప్రమత్తంగా ఉండాలి – అనధికారిక విత్తనాల కొనుగోలు, అమ్మకాలపై కఠిన చర్యలు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో నకిలీ,అనధికారిక పత్తి విత్తనాల రవాణా, నిల్వ,అమ్మకం మరియు కొనుగోళ్లను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ,పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కిష్టంపేట్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల నుంచే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.నకిలీ మరియు అనధికారిక విత్తనాల వాడకం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని తెలిపారు.విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవడం, ప్యాకెట్‌పై కంపెనీ పేరు,లాట్ నంబర్, గడువుతేదీ తదితర వివరాలను పరిశీలించడం తప్పనిసరి అని వివరించారు. అనుమానాస్పదంగా విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అనధికారికంగా పత్తి విత్తనాలను నిల్వ చేయడం, రవాణా చేయడం, అమ్మకం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ సిబ్బంది,పోలీస్ అధికారులు,రైతులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.