చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ
చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” అనే పోస్టర్ను మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ విడదల రజని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి విడదల రజని మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజల మధ్య ఉండి ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.