చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి పట్ల సంతాపం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు పోకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.