BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 May, 2026 - 01:25 PM
87 వీక్షణలు
చిలకలూరిపేట: దైవాజ్ఞను అనుసరించి సమాజ హితాన్ని కోరుతూ ప్రతి మానవుడు నిస్వార్థ సేవాభావంతో ముందుకు సాగాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ అందిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచడం ద్వారా దాతృత్వాన్ని పెంపొందించుకోవచ్చని, బక్రీద్ పండుగ అందరికీ సేవాభావం, సహనం, కరుణ, సోదరభావం వంటి విలువలను నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. తోటివారి పట్ల ప్రేమ, త్యాగం, సహనంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చే ఈ పవిత్ర పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అన్ని గుణాలలో దానగుణమే అత్యున్నతమైందని, ఆకలి అన్నది ప్రతి మనిషికీ సమానమని, అందుకే మానవత్వంతో కూడిన ధర్మమే నిజమైన మతసారమని బాలాజీ పేర్కొన్నారు. మతం ఏదైనా మానవత్వమే గొప్పదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పాలన కొనసాగిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో కలిసిమెలసి జీవించాలని, గంగాజమున తహజీబ్‌ను కాపాడుకుంటూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బక్రీద్ పండుగ సమాజంలో మరింత సోదరభావాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలని పెంటేల బాలాజీ ఆకాంక్షించారు.