BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 May, 2026 - 01:25 PM
122 వీక్షణలు
చిలకలూరిపేట: దైవాజ్ఞను అనుసరించి సమాజ హితాన్ని కోరుతూ ప్రతి మానవుడు నిస్వార్థ సేవాభావంతో ముందుకు సాగాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ అందిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ అన్నారు. త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మనకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచడం ద్వారా దాతృత్వాన్ని పెంపొందించుకోవచ్చని, బక్రీద్ పండుగ అందరికీ సేవాభావం, సహనం, కరుణ, సోదరభావం వంటి విలువలను నేర్పుతుందని ఆయన పేర్కొన్నారు. తోటివారి పట్ల ప్రేమ, త్యాగం, సహనంతో మెలగాలనే సందేశాన్ని ఇచ్చే ఈ పవిత్ర పండుగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అన్ని గుణాలలో దానగుణమే అత్యున్నతమైందని, ఆకలి అన్నది ప్రతి మనిషికీ సమానమని, అందుకే మానవత్వంతో కూడిన ధర్మమే నిజమైన మతసారమని బాలాజీ పేర్కొన్నారు. మతం ఏదైనా మానవత్వమే గొప్పదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పాలన కొనసాగిస్తోందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో కలిసిమెలసి జీవించాలని, గంగాజమున తహజీబ్‌ను కాపాడుకుంటూ సమాజంలో ఐక్యతను పెంపొందించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు. బక్రీద్ పండుగ సమాజంలో మరింత సోదరభావాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందించాలని పెంటేల బాలాజీ ఆకాంక్షించారు.