చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. కొండమంజులూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది.
రోడ్డు ఒక వైపు నుంచి మరోవైపుకు ఆటో దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం. పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఏలూరు తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.