చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కీ.శే. తాళ్లూరి సాంబశివ రెడ్డి విగ్రహం వద్ద పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి తాళ్లూరి రాధారాణి మాజీ ఎంపీపీ, మాజీ జడ్పిటిసి ఆధ్వర్యంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అల్లు చెన్నారెడ్డి, వైవి సత్యనారాయణ, అలవాల శంకర్ రెడ్డి, వడ్లమాని వెంకటేశ్వర రెడ్డి, గోలి శాంతారెడ్డి, కుప్పాల సోమయ్య, గారపాటి సత్యనారాయణ, బొల్లు శివ, నందమూరి శివ, లైన్మెన్ వెంకటేశ్వరరావు, రాము, ఉమ్మడి శ్రీను, రామాంజన చారి, రవి తదితరులు పాల్గొన్నారు.
అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.