చింతలపూడి: మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి: మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
నియోజకవర్గ అభివృద్ధి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై కీలక చర్చ
చింతలపూడి: రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికలు, డోర్ టు డోర్ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.
నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని, చింతలపూడి సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, మౌలిక వసతుల కల్పనతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.