BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 06:49 PM
44 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష

ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈరోజు వెలువడిన పదో తరగతి ఫలితాలపై మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాల గురించి సమీక్ష నిర్వహించారు. లింగపాలెం మండలంలో 82 శాతం, కామవరపు కోటలో 73 శాతం, చింతలపూడిలో 71 శాతం, జంగారెడ్డిగూడెంలో 68 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వివరించారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగా ఈ సంవత్సరం విద్యార్థులు గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారని అధికారులు తెలిపారు.

నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులను శాసనసభ్యులు అభినందిస్తూ, రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.