చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష
చింతలపూడి నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష
ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈరోజు వెలువడిన పదో తరగతి ఫలితాలపై మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాల గురించి సమీక్ష నిర్వహించారు. లింగపాలెం మండలంలో 82 శాతం, కామవరపు కోటలో 73 శాతం, చింతలపూడిలో 71 శాతం, జంగారెడ్డిగూడెంలో 68 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వివరించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగా ఈ సంవత్సరం విద్యార్థులు గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారని అధికారులు తెలిపారు.
నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులను శాసనసభ్యులు అభినందిస్తూ, రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.