BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:05 AM
34 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గంలో మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు : ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

చింతలపూడి: నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా మరో మూడు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి. ఈ మేరకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ అంబేద్కర్‌తో ప్రత్యేకంగా సమావేశమై విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

కామవరపుకోట మండలం పాపయ్యపాలెం, చింతలపూడి మండలం పొనుకుమాడు గ్రామాల్లో ఇప్పటికే నూతన విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు కాగా, వాటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామంలో మరో నూతన విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ అంశంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్‌తో ట్రాన్స్‌కో ఎస్సీ అంబేద్కర్, డి. రాంబాబు తదితర అధికారులు చర్చించారు.

నూతన విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు, రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.