www.ntodaynews.com
చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా
చింతలపూడి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల అధ్యక్షుడు చింతం విష్ణు మూర్తి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తోందని తెలిపారు. ప్రతి అర్హుడికి సమయానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శెట్టివారిగూడెం కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ పథకాలపై తమ మద్దతును తెలిపారు.