BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

చింతలపూడిలో ఘనంగా SIR అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:50 PM
72 వీక్షణలు

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చింతలపూడి పట్టణంలోని ఆర్‌కే మినీ ఫంక్షన్ హాల్‌లో SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు, నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వరరావు గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా SIR ప్రక్రియ ప్రాముఖ్యతపై విస్తృతంగా వివరించారు. ఓటరు జాబితా సవరణల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటించాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరిచే దిశగా ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా సమన్వయంతో పని చేయాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమానికి మండల, పట్టణ, గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్‌లు, BLAలు, నీటి సంఘాల అధ్యక్షులు, KSS సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ మాజీ సర్పంచులు, PACS చైర్మన్లు, వార్డు సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న నాయకులు కూడా పాల్గొన్నారు.

కార్యక్రమం విజయవంతంగా సాగడంతో పార్టీ శ్రేణులు SIR ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి ఓటరు జాబితా సమగ్రతకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.