BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చింతలపూడిలో ఘనంగా SIR అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:50 PM
22 వీక్షణలు

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చింతలపూడి పట్టణంలోని ఆర్‌కే మినీ ఫంక్షన్ హాల్‌లో SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు, నియోజకవర్గ పరిశీలకులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వరరావు గార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా SIR ప్రక్రియ ప్రాముఖ్యతపై విస్తృతంగా వివరించారు. ఓటరు జాబితా సవరణల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాటించాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరిచే దిశగా ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా సమన్వయంతో పని చేయాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమానికి మండల, పట్టణ, గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్‌లు, BLAలు, నీటి సంఘాల అధ్యక్షులు, KSS సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ మాజీ సర్పంచులు, PACS చైర్మన్లు, వార్డు సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివిధ హోదాల్లో సేవలందిస్తున్న నాయకులు కూడా పాల్గొన్నారు.

కార్యక్రమం విజయవంతంగా సాగడంతో పార్టీ శ్రేణులు SIR ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసి ఓటరు జాబితా సమగ్రతకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.