చింతలపూడిలో ఘనంగా తిరంగా యాత్ర
చింతలపూడిలో ఘనంగా తిరంగా యాత్ర
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి నగర పంచాయతీలోని గురుపట్లగూడెం రోడ్డులో ఉన్న జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తిరంగా యాత్ర నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాటూరి చక్రధరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులు, ఉపాధ్యాయులతో కలిసి జాతీయ జెండాను చేతబూని తిరంగా యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
దేశభక్తిని చాటుతూ విద్యార్థినులు, ఉపాధ్యాయులు నిర్వహించిన ఈ యాత్ర ఆకట్టుకుంది. జాతీయ జెండాలతో పురవీధుల్లో సాగిన తిరంగా యాత్రలో దేశభక్తి నినాదాలు మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.