BREAKING
మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త.. సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్‌..315 మందిపై కేసులు ఇంద్రపాలనగరంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు నంద్యాలలో యువకుడి దారుణ హత్య జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి....
www.ntodaynews.com

చింతలపూడిలో ప్రైవేట్ పాఠశాలలతో విద్యాశాఖ ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
40 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్. సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఒత్తిడి లేని, విలువలతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజన్ 2047 సాధనలో విద్యా రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు బలవంతంగా కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన కొనసాగిస్తూ, చదువుపై ఆసక్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా విద్యార్థులను దృఢంగా తయారు చేస్తూ, చదువుతో పాటు మనోధైర్యాన్ని పెంపొందించాలన్నారు. సమాజం పట్ల సేవా దృక్పథంతో ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పారు.

ప్రధాని ప్రతిపాదించిన వికసిత భారత్, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర, విజన్ 2047 సాధనలో భాగంగా వినూత్న బోధన పద్ధతులు అనుసరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎంఈఓ రామరావు సహా మండలాల ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.