చింతలపూడిలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఏలూరు జిల్లా చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉన్నమట్ల ఎలిజా ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
2029 నాటికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పరిపాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు, మండల అధ్యక్షుడు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.