BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 03 June 2026, 05:44 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 05:44 PM
45 వీక్షణలు

చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు పురస్కరించుకొని నిర్వహిస్తున్న చిన్మయ అమృత యాత్ర ఈరోజు చిలకలూరిపేటకు విచ్చేసిన సందర్భంగా పట్టణంలోని చిన్మయ మిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, లలితమ్మ ...

ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ… స్వామి చిన్మయానంద సరస్వతి గారి ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు వ్యాపించి ప్రజల్లో జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. జ్ఞానం ద్వారా మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రజలు జ్ఞానవంతులైతే ప్రపంచం అద్భుతంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న హింస, స్వార్థం, ఉగ్రవాదం వంటి అనేక రుగ్మతలకు మూల కారణం జ్ఞానలేమేనని అన్నారు.

భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు వంటి హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్న గొప్ప సందేశాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో స్వామి చిన్మయానంద సరస్వతి గారు ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలలో విస్తరించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.

హిందూ ధర్మ ప్రచారం, మానవాళి శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసి సేవ చేస్తున్న చిన్మయ మిషన్ సభ్యులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.