BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:12 PM
132 వీక్షణలు

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరసా వెంకటేశ్వరాకు చెందిన మూడు ఎకరాల గడ్డివాము పూర్తిగా కాలి బూడిదగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 25 వేల రూపాయల విలువైన గడ్డి కాలిపోయింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నోరులేని మూగజీవాలకు మేత కరువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ, "చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని చింతలపూడి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినప్పుడు వారు విస్సన్నపేట ఫైర్ స్టేషన్ కు కాల్ చేయమని చెప్పారని విస్సన్నపేట స్టేషన్ వారికి చేయగా తమ పరిధిలో అది లేదని, చింతలపూడి ఫైర్ స్టేషన్ వారే రావాలని చెప్పారని దీంతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వారు వచ్చిన తరువాత మంటలను అదుపు చేశారు" అని అన్నారు. కొమ్ము ఆనందం, "ఈ విధమైన ప్రమాదాలకు సమయానికి స్పందించేందుకు చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని వెల్లడించారు.