BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:12 PM
89 వీక్షణలు

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరసా వెంకటేశ్వరాకు చెందిన మూడు ఎకరాల గడ్డివాము పూర్తిగా కాలి బూడిదగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 25 వేల రూపాయల విలువైన గడ్డి కాలిపోయింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నోరులేని మూగజీవాలకు మేత కరువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ, "చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని చింతలపూడి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినప్పుడు వారు విస్సన్నపేట ఫైర్ స్టేషన్ కు కాల్ చేయమని చెప్పారని విస్సన్నపేట స్టేషన్ వారికి చేయగా తమ పరిధిలో అది లేదని, చింతలపూడి ఫైర్ స్టేషన్ వారే రావాలని చెప్పారని దీంతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వారు వచ్చిన తరువాత మంటలను అదుపు చేశారు" అని అన్నారు. కొమ్ము ఆనందం, "ఈ విధమైన ప్రమాదాలకు సమయానికి స్పందించేందుకు చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని వెల్లడించారు.